అందరికి నమస్కారములు,
నేను నాలుగు రోజులుగా "సత్య సాయి నిగామగమం " శ్రీ నగర్ కాలనీ లో జరుగుతున్న "బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు " గారు చెప్తున్నా "శ్రీ సుబ్రహమన్యే శ్వర స్వామి వారి వైభవం " వినటానికి వెలుతున్నాను . మనసుకు హాయిగా ఉన్ధి.ఇన్థ అదృష్టం కలగటం నా జీవితంలో రెండవ సారి. మొదటిది ఇషా సద్గురు గారి స్పీచ్ వినటం . రెండవది చాగంటి గారి ప్రవచనాలు వినటం . అది కూడా కుమారస్వామి వైభవమ్.
చాల అద్భుతం గ వున్నయి.
నాకు బాధ కలిగించిన విషయం ఏమిటంటే మంగళవారం షష్టి తిథి రోజు ప్రసాదం పెట్టారు . ఆ రోజు తోపులాట అంత ఇంత కాదు . చాగంటి గారి ప్రవచనాలు వింటున్న ,ఏ మాత్రం విచక్షణ లేకుండా తోసుకుంటూ వెళుతున్నారు ప్రసాదం కోసం .చగన్తి గారు చెప్తున్నా వినిపించుకొవట్లెదు .
మల్లి ఈ రోజు గురువారం పసుపు,కుంకుమ , గాజులు ఇస్తారు లైన్ లో వెళ్ళండి అంటే తోపులాట . కనీసం ముసలి వాళ్ళు ఉన్నారు అని కూడా చూసుకోకుండా అల తోసుకుంటున్నారు . అమ్మవరివి మనకి ప్రసాదం గ ఇవ్వాల్సిన గాజులు ఎన్ని పగిలిపోయయో తెలుసా తోపులాట మూలంగా ? మాకు దక్క లేదు .
చాల బాధగా ఉంది . దయచేసి ఈ బ్లాగ్ చదివే వాళ్ళు ప్రసాదం పెట్టె చోట ఎక్కడ తోసుకోవదు అని మనవి . మనము క్యూ పద్ధతి పాటిస్తే మన వెనుక వాళ్ళు కూడా పాటిస్తారు .
రేపు కళ్యాణము,అభిషేకము నాకు చాల భయము, బాధగా ఉంది ..
అసలు ఇవన్ని చూసి చాగంటి గారు మళ్ళి హైదరాబాదు వస్తార ప్రవచనాలు చెప్పటానికి? దయ చేసి ఆయన్ని ఇబ్బంది పెట్టవద్దు . మళ్ళి అయన హైదరాబాద్ వచ్చి ప్రవచాలు చెప్పేట ట్టు గా ప్రవర్తిద్దాము .
తప్పు అనుకుంటే క్షమించండి .
మీ అంజలి ....