28, జనవరి 2009, బుధవారం

నాన్న మనసు

నాన్న మనసు గురించి కూడా ఈనాడు పుస్తకములోనే చదివాను.
....ఉద్యోగం అంటూ ఉదయాన్నే లేచి వెళ్ళే నాన్న ఇంటి పట్టున ఉండలేడు
కంటి నిండా నిద్ర పోలేడు
ఇంటినే కాదు అందరిని ఒంటిస్థంబముల మోస్తున్న నాన్న----ఎప్పుడూ ఒంటరి వాడే.
సంపాదన అంతా కుటుంబానికే వెచ్చించి మిగిలింది దాచి పిల్లల్ని మెరుగు పెట్టడం కోసం ఆంక్షల్ని ,శిక్షల్ని రచించి తాను శత్రువై కుటుంబ సౌఖ్యం కోసం ఇంటా- బయటా నిరంతరం పోరాటం చేసే నిస్వార్థ యోధుడు- నాన్న.
"ఎవరక్కడ ? "అని అధికారం చెలాయించే నాన్నే గనక ఒక్క క్షణం మనసు మార్చుకుని నా సంపాదన- నా ఇష్టం అనుకుంటే "ఎవరెక్కడ?"
అమ్మ - కొవ్వోతై కరిగిపోతూ వెలుగునిస్తుంది.
నాన్న-అగ్గిపుల్ల ఆ వెలుగుకు నాంది !!!
చాలా బావుంది కదా అండి...
దయచేసి నా బ్లాగ్ లోని "అమ్మ మనసు" కూడా చదవండి..అది చాల చాల బావుంటుంది.



అమ్మ మనసు

ఎప్పుడో ఒక సారి ఈనాడు పుస్తకములో వచ్చింది "అమ్మ మనసు " గురించి .
నాకు బాగా నచ్చినది.




...నువ్వు మొదటి సారిగా గర్భాన కదిలినప్పుడు పరమానందం కలిగింది నన్ను అమ్మను చేస్తున్నావని!
నిద్ర రానీయకుండా హడావిడి చేస్తుంటే ఉత్సాహముగా అనిపించినది ఉషారైనవాడివి అని!
నను చీల్చుకుని ఈ లోకంలోకి వచ్చాక మమకారం పొంగులు వారింది నా ప్రతిరూపానివి అని!
నా రక్తాన్ని పాలుగా తాగుతుంటే బోలెడంత ఆశ కలిగింది అందరికంటే బలవంతుడివి అవ్వాలని!
తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతుంటే తట్టుకోలేనంత ఆనందం పొంగింది నీ కాళ్ళ మీద నీవు నిలబడగలవని!
ఆ అడుగుల్లోనే నాకు దూరమైతే ఆశీర్వదిమ్చాలి అనిపించింది గొప్పవాడివి అవ్వమని!
జీవన ఒత్తిడిలో పడి నన్ను మర్చిపోతే కొండంత ధైర్యం వచ్చింది నేను లేకపోయినా బ్రతకగలవని !
ప్రాణం పోయేటప్పుడు కంట తడి పెట్టనందుకు తృప్తిగా ఉంది నీకు తట్టుకునే శక్తి వుంది అని!
ఇప్పుడే నాకు కొంచెం బాధగా వుంది అందరు నేను పోయానని ఏడుస్తుంటే నన్ను కాల్చేటప్పుడు నీ చేయి కాలుతుందేమో అని!
.....బావుందా అండి. నాకు ఐతే చాలా బావుంది...చాలా ఏడుపు వస్తుంది ఇది చదివినప్పుడల్లా....
ఎవరు రాసారో కాని వాళ్ళకి నిజంగా నా ధన్యవాదాలు అండి.
నాన్న మనసు గురించి కూడా నా తరువాతి పోస్ట్ చూడండి.

27, జనవరి 2009, మంగళవారం

ఉద్యోగమూ...భార్య-భర్త..

నా ఆలోచనలు కొన్ని రాస్తున్నాను....మరి తప్పో ఒప్పో నాకు ఐతే తెలియదు...నా బ్లాగ్ పేరే "anjali's thoughts".
నేను నా ఊహలను ,నా ఆలోచనలను మీతో చెప్తున్నాను...మీరు చదివి ఎలా ఉందొ చెప్పండి.
అస్సలు విషయం ఏమిటంటే అంది భార్య-భర్త ,ఉద్యోగాలు,పిల్లలు వీటి గురించి రాద్దామని అండి...ప్రస్తుత సమాజంలో ఇద్దరు ఉద్యోగాలు చేస్తే గాని ఇల్లు గడవదు అని చెప్తూ ఉంటే వింటున్నాను..నిజమేలెండి బయట పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి..అన్ని ధరలు పెరిగిపోయాయి.ఈ కారణం ఐతే నిజమేనండి .కాని,,కోరికలు తీర్చుకోవటం కోసం అంటే కొంచెం నాకు ఎందుకో కష్టం గ అనిపిస్తుంది.దీని కోసం భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగం చేయనక్కరలేదు కదండీ.ఆడవాళ్ళూ కచితం గ చదువుకోవాలి.కాని ఉద్యోగం చేయాలని లేదు కదా... పెళ్లి అయిన తరువాత ఇంట్లో ఉంది అన్ని పనులు చేసుకోవటం సబబు అని నా అభిప్రాయం.ఎందుకంటె అండి దీనికి రెండు కారణాలు ఉన్నాయి..
౧.మనమే చక్కగా ఇల్లు సర్దుకోవచు.మన భర్త ఇంటికి వచ్చేటప్పడికి మనము ఆయనకు కావలసినవి అన్ని తయారు చేసి పెట్టి చక్కగా ఆయనతో కబుర్లు చెప్తూ పిల్లలు,భర్త,భార్య ఎంత చక్కగా వుంటుంది అండి...మనకి టైం ఉంటుంది కాబట్టి పోషక విలువలు ఉన్నా ఆహారం తయారు చేయచ్చు..విసుకు ఉండదు.పైగా మనకి కావలసినంత సమయం ఉంటుంది కాబట్టి ఎప్పుడు పని అప్పుడు పూర్తి చేసుకొవచు.మన ఇంటిని అందం గ డెకరేట్ చేసుకోవచ్చు.అప్పుడప్పుడు అల సరదాగా స్నేహితులతో బయటకు వెళ్లి షాపింగ్ చేసుకుని రావచ్చు.మన ఇంట్లో వాళ్ళకి అవసరమైనవి అన్ని సమకూర్చవచ్చు. అదే ఉద్యోగం చేస్తూ ఉంటే ఇవేమీ ప్రశాంతముగా చేయలేము.పిల్లలు పాడైపోతారు.వాళ్ళకి ఏ విషయాలు తెలియవు.భర్త ఇంటికి వచ్చేటప్పటికి మనము ఇంట్లో లేకపోతే ఆయనకి చాల కష్టంగా వుంటుంది.వాళ్లు ఇంటికి రాగానే కాస్త రిలాక్స్ అవటానికి ప్రయత్నిస్తారు.ఆ టైములో మనము ఆయనకు ఫ్రెండ్ లాగా వుండి అన్ని షేర్ చేసుకుని కాస్త టీ ఆర్ కాఫీ ఇవ్వటం లేక ఏమన్నా తినటానికి చేసిపెట్టటం చేస్తే బావుంటుంది.అప్పుడు భార్య-భర్త యెకూఅ సేపు గడిపినట్టు ఉంటుంది..పైగా పిల్లల చేత మనమే స్కూల్ వర్క్ చేయించవచ్చు.ఇలా చెప్పుకుంటూ పోతే చాల వుంటాయి అంది.మల్లి ఒక వేళ మనము అత్త,మామగారిని చూసుకోవాల్సి వస్తే ఉద్యోగం ఉంటే అస్సలు వీలు పడదు.మల్లి వాళ్ల కోసం ఒక పని అమ్మాయి...ఇవన్ని ఎందుకు అంది..ఎంత చక్కగా మనమే చేసిపెడితే వాళ్ళకి సేవ చాల బావుంటుంది కదా.పాపం వాళ్లు కూడా వయసులో ఉన్నప్పుడు కస్టాలు పడే ఉంటారు.మల్లి ముసలి వయసులో కస్తపెట్టటం ఎందుకు? అందువలన నా మటుకు ఏమి అనిపిస్తుంది అంటే....భర్త సంపాదించే డబ్బు మన కుటుంబ పోషణకి సరిపోతుంది అంటే భార్య వుద్యోగం చేయనక్కరలేదు...
౨.ఇది చాల ముఖ్యమైన విషయం అంది.....ఒక భర్త వుద్యోగం చేసిఒక కుటుంబం మొతము బతుకుతుంది...అదే ఉద్యోగం ఒక ఆడమనిషి సరదాకి ఉద్యోగం చేస్తే ? అదనపు డబ్బు,,,లేక టైం పాస్......ఉదాహరణకి ఒక ఉద్యోగానికి ఒక అమ్మాయి,ఒక అబ్బాయి కనక సెలెక్ట్ అయ్యి ఒక్కటే ఖాలీ ఉంటే నేను మాత్రం అబ్బైకి ఇవ్వటం కరెక్ట్ అంటాను..
****ఏమండీ నా మీద కోపం తేచుకోవదు..ముందుగానే చెప్పాకదా అంది ఒక వేళ అడ వాళ్ళు టైం పస్స్కో,లేక కోరికలు (luxurious life గడపాలి) కోసమో అయితేనే.... నిజముగా అత్యవసరము ఐతే మాత్రం ఆడ వాళ్లు కూడా తప్పకుండ పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకోవాలి.****
అందువలన మగవాళ్ళు ఉద్యోగాలు చేసినట్లితే చాల మటుకు కుటుంబాలు కడుపునిండా అన్నం తింటాయి అనిపిస్తోంది అంది.చాల మంది ఖాళీలు లేక ఉద్యోగం చేయలేకపోతున్నారు.అందువలన ఆ ఉద్యోగం ఒక మగవాడు చేయటానికి వీలు కల్పించినట్లు ఐతే ఒక కుటుంబం బాగు పడుతుంది..మనము సహాయ పడ్డట్టు అవుతుంది. ఇది కేవలము నా ఆలోచన మాత్రమె...నా ఈ పోస్ట్ చదివి అందరు మీ అభిప్రాయాలను కూడా తెలపాలని నా కోరిక.

22, జనవరి 2009, గురువారం

వినాయకుడికి .....21..... కి వున్నసంబంధం

నేను ఎకవిమ్సతి పత్రాల గురించి రాసాను కదా అంది...ఆ రోజు నుంచి అసలు 21 కి వినాయకుడికి సంభంధం ఏమిటి?21 పత్రాలె ఎందుకు వాడుతున్నారు ఇలా దౌబ్త్స్ మొదలయ్యాయి......ఆలోచిస్తూ ఆలోచిస్తూ కలంగాడుపుతూ ఉంటే....నిన్న రాత్రి ఏదో బుక్ చదువుతూ ఉన్నా...అందులో ఖచితంగా నా ఆలోచనలకి జవాబు ఉంది.
నాకు చాల ఆశ్చర్యం వేసింది.పైగా అది వినాయకుడికి సంభందించింది కూడా కాదు......
సర్లెండి...ఏమో కాని.....మీతో కూడా ఆ వివరాలు షేర్ చేసుకుంట....ఓకే
పరమ శివుని అనుగ్రహంతో శ్రీ గణేశుడు ఇంక ఇరవై రూపాలు ధరించాదుట..
అంటే మొత్తం 21 మంది అన్నమాట .
ఇంక పార్వతి దేవి ఎనలేని ఆనందం తో ఆ ౨౧ మందికి ౨౧ పేర్లను పెట్టి చాల ఆనందంగా చుసుకుంతోందిత.
ఇంక వాళ్ళకి బ్రహ్మ మానస పుత్రుడు ,ఉప బ్రహ్మ ఐన విశ్వ దర్శి కుమార్తెలు 21 మందిని ఇచ్చి వివాహం చేసారుట.
ఈ ౨౧ మంది గణపతులను తలచుకుంటే అన్ని శుభాలు జరుగుతాయట.
వారి పేర్లు...
1.శ్రీ గణేశుడు-జయ లక్ష్మి :--- లక్ష్మి గణపతి అని పిలుస్తారు..సర్వ కార్యాలు జయప్రదం చేస్తాడు.
2.సిద్ది గణపతి -సిద్ది బుద్ది లక్ష్మి :-ఈయన సిది బుధి ప్రదాయకుడు.
౩.చింతా మని గణపతి - విజయ లక్ష్మి :-ఈయన విజయ ప్రదాత.
4.ఏక దంత గణపతి-సిద్ది లక్ష్మి:-సర్వ సిద్ధులు అనుగ్రహిస్తాడు.
5.వక్ర తుండ గణపతి-నవ రత్న లక్ష్మి :- నవ విధులు అనుగ్రహిస్తాడు.
6.లక్ష్మి ప్రద గణపతి-వీర లక్ష్మి :-వీరత్వం వ్రిద్ది కావిస్తడు.
7.నింబ గణపతి-బుద్ది లక్ష్మి:-బుద్ది కుశలత అనుగ్రహిస్తాడు.
8.లంబోదర గణపతి-సిద్ధ విద్యదేవి:- సర్వ విద్య ప్రదాత.
9.రునవిమోచన గణపతి-సౌభాగ్య లక్ష్మి:-రుణ విమోచన కారకుడు.
10.శుక్ల గణపతి-బుద్ది లక్ష్మి:-సుబుద్ధిని అనుగ్రహించగలదు
11.ధూమ్ర గణపతి-సిది లక్ష్మి:-సర్వ సిది ప్రదాత.
12.రక్త వర్ణ గణపతి-పద్మా దేవి:-గ్రహ దోష నివారకుడు.
13.సువర్ణ గణపతి-రజితా దేవి:- సువర్ణ రజత ప్రదాత.
14.విగ్గ్న గణపతి-ప్రజా దేవి:-సర్వ విగ్గ్న హరుడు.
15.నిర్విగ్న గణపతి-అతి ప్రజ్ఞా దేవి-నిర్విగ్నంగా కార్య సమాప్తి కావించ సమర్ధుడు.
16.వికట గణపతి-జ్ఞాన దేవి:- జ్ఞాన ప్రదాత.
17.బాల చంద్ర గణపతి-చంద్రముఖి:-ఆనంద ప్రదుడు.
18.సర్వాంబర గణపతి-సంహార దేవి:-శత్రు సంహార కారకుడు.
19.గణాధిపతి-శాంతా దేవి:-శాంతి ప్రదుడు.
20.భద్ర గణపతి-లోకమాత దేవి:-శాంతి భద్రతల సంరక్షకుడు.
21.చివరిగా మనమందరం వర sidhdhi  వినాయకుడు అని పిలుచుకుంటాం...
ఇది అంది విషయం...అందువలన అనుకుంట ౨౧ అనే సంఖ్యా వచ్చింది...
******ఏమన్నా తప్పుగా వున్నా యెడల క్షమించగలరు..నాకు చెప్పండి సరి చేసుకుంటాను...

21, జనవరి 2009, బుధవారం

చిట్కాలు

౧.బాగా దగ్గు వస్తుంటే కరక్కాయ ముక్కను బుగ్గలో పెట్టుకుని మెల్లిగా దాని రసం మింగుతూ ఉంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది.
౨.మూడ్ కొంచెం చిరాకుగా ఉంటే వెంటనే కాఫీ పొడి వాసన చుడండి...తాగాక్కరలేదు.
౩.పెరుగు త్వరగా తోడుకోవాలి అంటే ఒక పచ్చి మిరపకాయను తుంచి వేయండి..చక్కగా తియ్యగా తోడుకుంటుంది.
౪.గులాబ్ జామ్ చేసేటప్పుడు గులాబ్ జామ్ పిండిలో కొంచెం పచ్చి కోవా కలిపి చేస్తే
చా లా మెత్తగా రుచికరంగా వస్తాయి.
౫.

19, జనవరి 2009, సోమవారం

వినాయక చవితి పత్రి గురించి........

మన బొజ్జ గణపయ్యకి వినాయక చవితి నాడు ఏకవింశతి పత్రాలతో పూజ చేస్తాం కదా....
మనకి బయట బోల్డు ఆకులూ అమ్ముతారండి...అవన్నీ ఏవేవో ఉంటాయి.అసలు అవి ఏమిటో తెలియదు.అవి పెట్టచో పెట్టకుడదో తెలియదు.
ఏకవింశతి అంటే ౨౧ రకాలు అన్నమాట.వీటి గురించి చెప్తాను వీటితో చేస్తే సరి.అవి
1.బృహతి పత్రం (వాకుడు ఆకు) :- ఇది ఉబ్బసాన్ని తగ్గిస్తుంది.
2.మాచి పత్రం (ధవనం):- ఒతిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది.
౩.బిల్వపత్రం (మారేడు ఆకు) :- మధు మేహం,విరేచనాలకు విరుగుడుగా పని చేస్తుంది.
4.దూర్వ పత్రం (గరికె గడ్డి) :- రోగ నిరోధకంగా పని చేస్తుంది.
5.దత్తుర పత్రం (ఉమ్మేత):- ఊపిరితితులను వ్యకోచిమ్పచేసి ఉబ్బసం తగ్గేలా చేస్తుంది.
6.బదరి పత్రం (రేగు ఆకు):- చర్మ వ్యాధులకు మంచి విరుగుడు.
7.తుర్యా పత్రం(తులసి):-శరీరంలో ఉష్ణాన్ని నియమ్త్రిస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి. ఆ గాలికి జలుబు,దగ్గు వంటివి దరి చేరవు.
8.అపామార్గ పత్రం(ఉత్తరేణి): దగ్గు ,ఉబ్బసంకి బాగా పని చేస్తుంది.
9.చూత పత్రం(మామిడి ఆకు):-నోటి దుర్వాసన,చిగుళ్ళ వాపు వంటి సమస్యల నుంచి ఉపసమనం ఇస్తుంది.
10.జాజి పత్రం(జాజి ఆకు):- చర్మ రోగాలు,స్త్రీ సంభంద వ్యాధులకు మంచిది.
11.గండకి పత్రం(అడవి మొల్ల యుధిక):- అతిమూత్ర సమస్యనుంచి ఉపసమనం ఇస్తుంది.
౧౨.అశ్వత పత్రం(రావి ఆకు):చాల ఓషధగుణాలు ఉన్నాయి.
13.అర్జున పత్రం(మద్ది ఆకూ):-రక్త స్తంభనం,గుండె ఆరోగ్యానికి ఇది చాల సహాయకారి.
14.అర్క పత్రం(జిల్లేడు ఆకూ) :-నరాల బలహీనత ఉన్నవరికిది దివ్య ఒషధం.చర్మ వ్యాధులను నివారిస్తుంది.
15.విష్ణు క్రాంతం(పొద్దు తిరుగుడు):-దీనిపై జరిగిన ఎన్నో పరిశోధనలు చెబుతున్న దేమిటంటే ఇది మంచి స్కిన్ కేర్ మందుగా పనిచేస్తుంది.
16.దాడిమ పత్రం(దానిమ్మ ఆకూ):- వాంతులు,విరేచనాలు,అరికడుతుంది.శరీరంలో ఉన్నా హానికారక క్రిములను నాశనం చేస్తుంది.
17.దేవదారు(దేవదారు):-శరీర వేడిని తగ్గిస్తుంది.
18.మరువాకం(మరువం):-మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
19.సింధువార పత్రం(వావిలాకు):కీల్లనోప్పులకు మంచి మందు.
20.శమీ పత్రం(జామ్మీ చెట్టు):-నోటి వ్యాధులను తగ్గిస్తుంది.

21.కరవీర పత్రం(గన్నేరు):-గడ్డలు,పుల్లు తగ్గటానికి దీని వేరు,బెరడు వాడతారు.
ఇవి అంది ౨౧ రకాలు.వీటితో చేస్తే చాలు...అనవసరంగ మనకు తెలిసి తెలియక ఎందుకు అంది బయట పిచి ఆకులూ అన్ని కొనటం చేయటం.
పైగా వీటిల్లో చాల మొక్కల్లు మనింట్లో ఉండేవే.లేదంటే బయట ఒక చుట్టూ తిరిగితే ఎవరో ఒకరి ఇంట్లో ఉంటాయి.అంతే.

18, జనవరి 2009, ఆదివారం

మా అందమైన ఊరు ఉండవల్లి,నేను ,మా ఇల్లు,మా కుటుంబం...

అస్సలు మా ఊరి గురించి చెప్పాలి కదా అండి. మాది ఉండవల్లి.ఇది కావటం గుంటూరు జిల్లా ఐన కానీ విజయవాడకి దగ్గర.విజయవాడకి, ఉండవల్లికి మధ్యన ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది.బ్యారేజ్ మీద నుంచుంటే చాల బావుంటుంది..చుట్టూ పక్కల ప్రకృతి చాల బాగా కనిపిస్తుంది.సరేలెండి...ప్రస్తుతానికి మా ఊరు గురించి కదా చెప్పేది.
సహజం ga పల్లెటూరు అంటే మనుషులు అందరు కలుపుగోలుగా వుంటారు.సాయంత్రం అయింది అంతే అందరు బయటే.మా ఊరు అంతే నండిచాల బాగుంటుంది.నేను౨ వ తరగతి చదువుతున్నప్పుడు నుంచి ఉండవల్లిలోనే ఉన్నాం అంటే సుమారు ౧౭ సంవత్సరాలు అవుతోంది.అప్పటికి ఇప్పటికి చాల మార్పులు వచాయి.అప్పుడు నిజంగా పల్లెతురిలా ఉండేది.ఇప్పుడు కొంచెం పట్నం వాతావరణానికి దగ్గరగా వస్తోంది.జనాబా ఎక్కువ అయ్యారు..కానీ ఇప్పటికి పంటలు పండిస్తారు..చామంతి,బంతి,గులాబీ,అబ్బో బోల్డు రకాలు అన్ని చాల బాగా ఉంటాయి.అరటి తోటలు ఐతే చెప్పక్కర్లేదు బోల్డు.కార్తిక మాసం వచ్చింది అంటే చాల ఇంక వనబోజనాలు..చాల చాల వండుకుని వెళ్ళే వాళ్ళం..సాయంత్రం వరకు ఆడుకోవటం ఇంటికి రావటం పడుకోవటం.అలాగే అన్ని రకల పండుగలు కలిసి చేసుకుంటాం..సంక్రాంతి ఐతే ఇంక బాగా జరుపుకుంటాం...
మా ఇంట్లో ఐతే ఏమి పిండి వంటలు చేసుకోవక్కర్ల.నేను ఒక్కదాన్నే ఉంటాను అని అందరు చాల రకాలు ఇచే వాళ్ళు నాకు.అందువలన అందరి ఇళ్ళలో కన్నా మా ఇంట్లోనే ఎక్కువ పిండి వంటలు ఉండేవి.ముగ్గులు పోటి పది పెద్ద పెద్దవి వేసేవాళ్ళం.అక్కడ హరిదాసులు,గంగ్గిరేద్దులు,గొబ్బెమ్మలు అసలు పల్లెటూరే వేరు అంది.ఎంత బావుంటుందో.కోత బియ్యం వస్తాయి కదా అటుకులు మరలు వుండేవి..చక్కగా వడ్లు నన పెట్టుకుని వెళితే అటుకులు వేసి ఇచే వాళ్ళు.
ఒక విషయం మర్చిపోయాను...నేను చిన్నప్పుడు రూపాయికి నాలుగు ఇడ్లిలు ఇచే వాళ్ళు.అబ్బ దానిలోకి పచడి ఉండేది సూపర్ ఇంక రుచి చెప్పక్కర్లేదు..కొన్ని సార్లు ఐతే పచడి ఒక్కటే తేచుకునేవాళ్ళం.
పైగా మా నాన్నగారు ఉండవల్లి కి పంచాయతి ఆఫీసర్ అన్నమాట..ఇంక మనకి కొంచెం గవురవం ఇచేవాళ్ళు...
అల అల అక్కడే ఇల్లు కట్టుకుని స్థిరపదిపోయం.ఇంక మా ఇల్లు చాల బాగుంటుంది.చిన్న స్థలంలోనే కట్టుకున్నాం..కానీ ముందు మొక్కలకి స్థలం వదిలి కట్టుకున్నాం...ఇంక మా ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉంది.రసం మామిడి చెట్టు..ఇంక ఆ కాయలే మాకు అన్ని రకల పచల్లకి.....
మల్లి అందరు కోసుకుని పోతు ఉంటారు..దానికి కాపలా
గులాబీలు,మల్లె,సన్నజాజి,కనకాంబరాలు ,మందారాలు అన్ని రకల చెట్లు ఉన్నాయి....మా నాన్న గారికి చాల ఆసక్తి ఎక్కువ మొక్కలంటే.అందుకని ఏవో ఒకటి పెంచుతూనే ఉంటారు...
అన్నట్టు చెప్పటం మరిచాను మేము మొత్తం ౫ గురం...మా అమ్మ,నాన్న,ఇద్దరుఅన్నలు,నేను ........ప్రస్తుతానికి ఐతే మా అందరికి పెళ్ళిళ్ళు ఐపోయాయి...అందరం ఇప్పుడు హైదరాబాద్.....ఉరుకులు,పరుగులు జీవితం.
అప్పుడప్పుడు వెళుతూ ఉంటాం ఉండవల్లికి.
ఇక పోతే మా ఊరిలో గొప్పగా చెప్పుకోవలసింది..గుహల గురించి..అక్కడ అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంటుంది..ఎంత బావుటుందో..అక్కడ పూర్వకాలంలో మునులు తపస్సు చేసుకునే వాల్లుట ...మల్లి మంగళగిరిలో పానకాల స్వామి గుడి ఉంది ...ఇక్కడ గుహలు ఉన్నా కొండ నుంచి అక్కడ మంగళగిరిలోని పానకాల స్వామి గుడి వరకు కొండలోనే స్వరంగా మార్గం ఉందిట.కాని అది మూసేసి ఉంది.
ఇంక గుహల దగ్గరలోనే కొండవీడు వాగు ఉంది..కొంచెం ప్రమాదకరం ...అప్పుడప్పుడు వరదలు వచినప్పుడు పొంగుతూ ఉంటుంది.
గుహల గురించి పూర్తిగా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయండి
http://en.wikipedia.org/wiki/Undavalli_caves

17, జనవరి 2009, శనివారం

జుట్టు పెరగటానికి చిట్కాలు

౧. రాత్రి పూట తలకు బాగా కొబ్బరి నూనె రాసి ఉదయాన్నే కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి.
౨.వారానికి ఒక సారి కోడి గుడ్డు లోని తెల్ల సోన ను తలకు రాసుకుని గంట తరువాత తల స్నానం చేయాలి.పొరపాటున పచ్చ సోన పెట్టుకునేరు తలలో జుట్టు ఆమ్లెట్ లాగా అవుతుంది.చక్కగా పచ్చ సోనతో వుల్లిపాయ చేర్చి కూర చేసుకోండి .చాల బావుంటుంది కదా!
౩. వారానికి ఒకసారి వేప ఆకులూ ,నిమ్మ ఆకులూ కలిపి పేస్టు చేసి తలకు పెట్టుకుని ఒక గంట తరువాత తల స్నానం చేయాలి.జుట్టు పట్టులాగా మెత్తగా వుంటుంది . అంతే కాదండోయి చుండ్రు కూడా పోతుంది .
౪.పార్లర్ కి వెళ్లి నెలకి ఒకసారి ఆయిల్ మసాజ్ చేయించుకోవాలి. లేకపోతే మనము ఇంట్లో ఐన చేసుకొవచు.అదే పార్లర్ కి వెళితే మనము ప్రశాంతతని పొందుతాము .
౫.బాగా మంచి నీళ్లు తాగాలి.మాసాలాలు తినకూడదు.వెల్లుల్లి అస్సలు తినకూడదు ..ఎందుకంటె తలలో చుండ్రు వుంటే అస్సలు పోదు.
౬.బాగా వేడి నీళ్ళతో బాగా చల్ల నీళ్ళతో తల స్నానం చేయకూడదు. గోరు వెచ్చని నీళ్ళతో మాత్రమె తల స్నానం చేయాలి.
౭.దువ్వేనాను ౩ రోజులకు ఒకసారి సుబ్బరం గ కడుగుకోవాలి...ఎవరి దువ్వెన వారికీ వుంటే చాల మంచిది.అప్పుడు సగం బాధలు తీరుతాయి .
౮.ముఖ్యముగా మనసుకు ఎటువంటి బాధ కలిగించకూడదు ..అంటే మానసిక బాధలు వుండకూడదు.వుంటే మాత్రం చాల చాల జుట్టు వూదిపోతుంది.
**********************************************************************
నేను ఇవన్ని పాటిస్తాను మరి మీరు కూడా పాటించి మీ జుట్టుని బాగా పెంచుకుంటారు అనుకుంటున్నా***** ********************************************

5, జనవరి 2009, సోమవారం

వంట గది సర్దుకోవటం ఎలా?

వంట ఇల్లు అంటే చికాకు పడకుండా ముందుగ అన్ని ఆలోచించుకుని సర్దుకుంటే అస్సలు వంట అంత తేలిక పని ఇంకొకటి వుండదు.వంట గది ఎలా వుండాలో నాకు తెలిసినది నేను చెప్తాను. ఏదో కొన్ని సలహాలు......మరి బావుంటాయో లేదో చూడండి.ఏమి లేదండి కొంచెం ఖర్చు అవుతుంది అంతే...ఎలాగంటే డబ్బాలు అంతే .........
౧.ముందుగ మనము ఇంట్లో నెలకు ఏమేమి సరుకులు వాడతామో ఆలోచించుకుని ఒక పేపర్ మీద రాసుకోవాలి. సుమారు పప్పులు,పిండ్లు కిలో చొప్పున వాడతాము అనుకోండి ...బయట ప్లాస్టిక్ డబ్బాలు (లోపల మనము పోసినవి పయికి కనపడుతూ వుండే లాంటివి అన్నమాట) దొరుకుతాయి కదా అవి కొనుక్కుంటే సరిపోతుంది...ఇంక మనము సర్దుకోవటమే ఆలస్యం,....ఆవాలు,జీలకర్ర లాంటివి తక్కువ వాడతాం కాబట్టి చిన్న డబ్బాలు కొనుక్కుంటే సరి.పోసుకుంటే మనమే కాదుఇంక ఎవరినా సరే తేలికగా వంట చేసుకోవచ్చు.అందరు మనల్ని ఒసేయి అది ఎక్కడ పెట్టవే ఇది ఎక్కడ పెట్టవే అనే బాధ తప్పుతుంది...
౨.వంట గదిలో సామాను ఎంత తక్కువ వుంటే అంత మంచిది.బొద్దిన్కలకి,దోమలకి,ఈగలకి వంట ఇల్లు పుట్టినిల్లు.అందుకని మనకు రోజు వాడుకునేవి మాత్రం కొనుక్కుంటే సరి.అంతగా ఎవరన్నా చుట్టాలు వస్తే బయట పేపర్ ప్లేట్స్ పేపర్ గ్లాసులు,వగైరా వుందనే వున్నై.
౩.వంటగదిలో గోడకు పెట్టుక్నేస్టాండ్స్ వుంటాయి అది తెచ్చుకుని గోడకు పెట్టుకుంటే సగం సామాను దానిలో పెట్టుకోవచ్చు .కంచాలు,గరిటెలు,గ్లాసులు ,వగయిరా అన్ని అందులో పెట్టుకోవచ్చు.బావుంది కదా ...అప్పుడు ఎక్కువ అలమారాలు కూడా అవసరం లేదు .పని తేలిక అయిపోతుంది...గిన్నేన్లు కదగాగానే సర్దుకోవటానికి కూడా తేలిక అయిపోతుంది....కొంతమంది ఐతే అలమరాలే రకరకాలుగా పెట్టుకుంటున్నారు...వాటిని ఐతే మనము ముందు పట్టుకుని లాగగానే సర్రుమని ముందుకు వచేస్తై చక కాక వాటిల్లో సర్దుకోవచ్చు...అంత సంపాదన లేని వాళ్లు యెట్లా పెట్టించుకుంటారు..చెప్పండి.అందుకే స్తన్ద్తో సరిపెట్టుకుందాం...లేదు అంటే అలాంటివి కూడా పెట్టిచ్చుకోవచు...కాని వాటితో బొద్దింకల గొడవ ఎక్కువ అనుకుంట.ఏమోలెండి....
౪.ఇంకాగిన్నెలు కదగాగానే నీళ్లు పోవటానికి గిన్నెల బుట్టలు వుంటై బయట.. అది ఐతే సుబ్రంగ నీళ్లు అన్ని పోయాక మనము సర్దుకోవచ్చు.
౫.సరే మరి ఐతే ఇంక వంట సంగతికి వస్తే ఒక కుక్కర్ ,,,నోన్స్తిక్ మూకుదుల సెట్ ఐతే బావుంటుంది.చక్కగా తక్కువ నూనె తో వండుకోవచ్చు.మాడదు,రుచికరంగా వస్తాయి...కడుగుకోవటం తేలిక.
౭.ఇంక మరి మనము వండేటప్పుడు మనకు ఎక్కువగా నూనె,తాలింపు గింజలు,ఉప్పు,కారం,పసుపు కావాలి కదా.అందువలన అవి అందుబాటులో పెట్టుకోవాలి.మరియు నూనె,నెయ్యి చిన్న గిన్నెలో పోసుకుని ఆ రెండు కలిపి ఒక ప్లేట్ లో పెట్టుకుంటే కింద అంత నూనె అంటదు.