11, మార్చి 2011, శుక్రవారం

మనమంతా ఒక్కటే

మనమంతా ఒక్కటే  అని అందరి నోట ఎప్పుడు విన్టానో.
ఉదాహరణకి హాస్పిటల్ తీసుకుంటే.........అక్కడ పని చేసే నర్సులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మనకు సేవ చేస్తున్నారు.మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు?
వాళ్లకి మనుషులు అంత ఒకటే.
ఒక డాక్టర్ నేను పాలనా వాళ్ళకే ట్రీట్మెంట్ ఇస్తాను అని కూర్చుంటే ఎంతమంది చనిపొతారో కదా....
కాని వాళ్ళకి కులాలు,మతాలు,ముఖ్యంగా నా దేశం అనేది కూడా ఉండదు.ఎవరు వచ్చిన వాళ్లకి ట్రీట్మెంట్ ఇస్తారు.ఎవరైనా సరే .....రోగం వచ్చిన వాళ్ళు చికిత్స కోసం ప్రపంచంలో ఎక్కడికైనా వెళతారు వాళ్ళ స్తోమతను పట్టి.
మనకి ప్రాణం పోసేది డాక్టర్లు.మనము బ్రతికి ఉంటేనే మనకు కావాల్సిన  హక్కులు సాధించుకోగలం..మనమే లేకపోతే......?
నాకు నా ప్రాంతం డాక్టరు చికిత్స చేయాలి అని ఎవరు ఉండరు.
అల్లాగే డాక్టర్ల దగ్గర అందరు సమానమే.నాకు తెలిసి ఈ ప్రపంచంలో అందరికన్నా గొప్పవారు డాక్టర్లు.అలాంటి వారికే తేడాలు లేనపుడు మనకు ఎందుకు తేడాలు.
మనము అందరమూ ఒకటే. బతికినన్ని రోజులు హాయిగా బతుకుదాం.
ఉంటాను...మీ అంజలి.

10, మార్చి 2011, గురువారం

మనుషులా రాక్షశులా (పిచ్చి జనం ,పిచ్చి గోల )

అసలు రాజకీయాలు అంటేనే నాకు ఇష్టం లేదు.కాని ఈ రోజు మిలియన్ మార్చ్ అంటూ వాళ్ళు చేసిన రచ్చ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది.నా గుండె తట్టుకోలేకపోతోంది.టాంక్ బండు మీద ఉన్న విగ్రహాలు వాళ్ళని ఏమి చేసాయి.
ప్రకృతిని నాశనం చేస్తున్నారు.ఛి ...
గాంధీ గారు మనకు మన భారత దేశాన్ని ఇచ్చారు.దానిలో మల్లి భాగాలు.
బాబోయ్ నాయకులని చూస్తుంటే విసుకు వేస్తోంది. అసలు విద్యార్థులకి ...ఇలాంటి పనులకి లింక్ ఏమిటో నాకు అర్థం కాదు.చదువుకుని దేశాన్ని ఎలా అభివ్రుది చెయాల అని కాకుండా ఎలా ముక్కలు చెయాల అని ఆలోచిస్తున్నారు.
వీటికన్నా కూడా ఈ రోజు విగ్రహాలను నాశనం చేయటం అనేది చాల బాధపెడుతున్న విషయం.ఏనాటి నుంచో చక్కగా అందంగా ఉన్న వాటిని పాడుచేసారు.ఎక్కడో విదేశాల నుంచి వచ్చి వీటిని చూసి అందరు మెచ్చుకుని వెళతారు.ఇక్కడే ఉన్న వాళ్ళు మాత్రం నాశనం చేసారు..అసలు కొంచెం కూడా మానవత్వం,మంచి హృదయం అనేది లేదనుకుంట వాళ్లకి.
నాకు చాల సిగ్గుగా ఉంది.ఛి.ఛి. .........
ఇలాంటి మనుషుల మధ్యనే బతకాలి. తప్పదు కదా.
ఉంటాను....బాధతో............మీ అంజలి.